తండ్రీకొడుకులుగా బిగ్ బి, టైగర్!
on Oct 27, 2021
`హీరోపంతి` (2014) వంటి సక్సెస్ ఫుల్ మూవీ తరువాత యంగ్ హీరో టైగర్ ష్రాఫ్, టాలెంటెడ్ బ్యూటీ కృతి సనన్ కాంబినేషన్ లో మరో సినిమా రాబోతోంది. `గణపథ్` పేరుతో రూపొందనున్న ఈ చిత్రాన్ని `క్వీన్`, `సూపర్ 30` సినిమాల దర్శకుడు వికాస్ భల్ తెరకెక్కించనున్నారు. స్పోర్ట్స్ డ్రామాగా తయారుకానున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో బాక్సర్ గా కనిపించబోతున్నాడు టైగర్ ష్రాఫ్. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి చిత్రీకరణ ప్రారంభం కానుంది.
ఇదిలా ఉంటే.. తాజాగా `గణపథ్` చిత్రానికి సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. అదేమిటంటే.. ఇందులో టైగర్ ష్రాఫ్ కి తండ్రిగా బాలీవుడ్ మెగాస్టార్, `బిగ్ బి` అమితాబ్ బచ్చన్ ని నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నాయట. అభినయానికి ఆస్కారమున్న పాత్ర కావడంతో అమితాబ్ కూడా ఈ పాత్ర చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారని బాలీవుడ్ బజ్. త్వరలోనే `గణపథ్`లో అమితాబ్ ఎంట్రీపై క్లారిటీ రానుంది.
కాగా, ప్రస్తుతం వికాస్ భల్ దర్శకత్వం వహిస్తున్న `గుడ్ బై`లో అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఇందులో కన్నడ కస్తూరి రష్మికా మందన్న కూడా ముఖ్య పాత్ర పోషిస్తోంది. `గుడ్ బై` పూర్తయ్యాకే `గణపథ్`ని పట్టాలెక్కించబోతున్నాడు వికాస్ భల్.
Also Read